ఎయిర్‌టెల్ కస్టమర్లకి అదిరిపోయే ఆఫర్ ....126 జీబీ వరకు అధిక డేటా

     Written by : smtv Desk | Mon, May 27, 2019, 04:30 PM

ఎయిర్‌టెల్ కస్టమర్లకి అదిరిపోయే ఆఫర్ ....126 జీబీ వరకు అధిక డేటా

ఎయిర్‌టెల్ కస్టమర్లకి అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. 4జీ హాట్‌స్పాట్ డివైజ్ ప్లాన్లను సవరించి ప్రిపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లను ఆవిష్కరించింది. వీటి ద్వారా యూజర్లకు 126 జీబీ వరకు అధిక డేటాను అందిస్తోంది. ఎయిర్‌టెల్ 4జీ హాట్‌స్పాట్ యూజర్లకు ఇదివరకు కేవలం రూ.399 ప్లాన్ మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ ప్లాన్‌లో నెలకు 50 జీబీ డేటా లభించేంది. కానీ ఇప్పుడు యూజర్లు రెండు ప్లాన్లను ఎంచుకోవచ్చు. ఇవి రూ.1,500 పెట్టి ఎయిర్‌టెల్ 4జీ హాట్‌స్పాట్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రిపెయిడ్ ప్లాన్ ఎంచుకున్న సబ్‌స్క్రైబర్లు 84 రోజులపాటు రోజుకు 1.5 జీబీ డేటా పొందొచ్చు. 1.5 జీబీ 4జీ డేటా అయిపోయిన తర్వాత నెట్‌వర్క్ స్పీడ్ 80కేబీపీఎస్‌కు తగ్గుతుంది. అదే పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఎంచుకున్న వారికి నెలకు 75 జీబీ డేటా వస్తుంది. నెలలో ఉపయోగించకుండా మిగిలిన డేటా తదుపరి నెలకు ఫార్వర్డ్ అవుతుంది. అదే డేటా అయిపోతే నెట్‌వర్క్ స్పీడ్ 80కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఇకపోతే ఎయిర్‌టెల్ 4జీ హాట్‌స్పాట్ అనేది జియో ఫై మాదిరే ఉంటుంది. దీనికి ఫోన్‌తోపాటు ల్యాప్‌టాప్, ట్యాబెట్స్ వంటి వాటిని కనెక్ట్ చేసుకోవచ్చు. ఏకంగా 10 డివైజ్‌లను దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో 1500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఆరు గంటలపాటు చార్జింగ్ రావొచ్చు. ఈ హాట్‌స్పాట్ డివైజ్ అందుబాటులో 4జీ నెట్‌వర్క్ లేకపోతే 3జీ నెట్‌వర్క్‌కు ఆటోమేటిక్‌గానే కనెక్ట్ అవుతుంది.





Untitled Document
Advertisements