లాభాలకు బ్రేకులు

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 06:33 PM

లాభాలకు బ్రేకులు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కూడా నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 193 పాయింట్ల నష్టంతో 39,757 పాయింట్ల వద్ద ముగసింది. ఇక నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 11,906 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఒకానొక సమయంలో 300 పాయింట్లకుపైగా పడిపోయిన మార్కెట్ చివరకు కొంత రికవరీ అయ్యింది. ముడిచమురు ధరల తగ్గుదల కూడా మార్కెట్‌ను నష్టాల నుంచి బయటపడేయలేకపోయింది. బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఇకపోతే ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లు, ఆటో రంగ షేర్లు బాగా పడిపోయాయి. మెటల్, ఎఫ్ఎంసీజీ షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి.





Untitled Document
Advertisements