కిర్గిస్తాన్ కు మోడీ

     Written by : smtv Desk | Thu, Jun 13, 2019, 01:36 PM

కిర్గిస్తాన్ కు మోడీ

భారత ప్రధని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం కిర్గిస్తాన్ వెళ్లారు. ఆయన ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో పాకిస్తాన్‌ మీదుగా కాకుండా ఇరాన్, ఒమన్, ఇతర మధ్య ఆసియా దేశాల మీదుగా బిష్కెక్‌ బయలుదేరి వెళ్లారు. సాయంత్రం జరగనున్న షాంఘై సహాకార సదస్సులోపాల్గొనున్నారు మోడీ. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోడీ చైనా అధ్యక్షుడు జిపింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహినిలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనాతో పాటు భారత్‌పై కూడా వాణిజ్య యుద్ధం మొదలుపెట్టిన నేపథ్యంలో జిన్‌పింగ్ తో మోడీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.





Untitled Document
Advertisements