ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తాజాగా మరో వినూత్నమైన సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. జొమాటో రానున్న రోజుల్లో డ్రోన్ల సాయంతోనే నేరుగా ఫుడ్ డెలివరీ చేసే అవకాశముంది. ఇప్పటికే కంపెనీ ట్రయల్స్ కూడా పూర్తిచేసింది. బుధవారం కంపెనీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇకపోతే జోమాటో గత ఏడాది డిసెంబరులో గుర్గావ్కు చెందిన స్టార్టప్ టెక్ఈగిల్ను కొనుగోలు చేసింది. డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీ లక్ష్యంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. డ్రోన్ విషయానికి వస్తే.. ఇది 10 నిమిషాల్లోనే 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. డ్రోన్ గంటకు గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. 5 కిలోల బరువు కలిగిన ఆహారాన్ని మోసుకెళ్లగలదు. డ్రోన్ సేవలతో స్విగ్గీ, ఉబెర్ ఈట్స్ వంటి కంపెనీలకు పోటీ మరింత పెరిగే అవకాశముంది.