75 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కలుసుకున్న ప్రేమజంట

     Written by : smtv Desk | Thu, Jun 13, 2019, 02:33 PM

75 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కలుసుకున్న ప్రేమజంట

యవ్వన వయసులో విడిపోయిన ప్రేమికులు 75 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత వృద్ధాప్యంలో తిరిగి కలుసుకున్నారు. ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. కేటీ రాబిన్స్‌ అనే అమెరికన్‌ సైనికుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జెన్నీ పియర్సన్‌ అనే ఫ్రెంచి అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. రెండు నెలల తర్వాత ఆక్సిస్‌ ఫ్రంట్‌తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యుద్ధం నుంచి వచ్చాక ఆమెను తీసుకువెళతానని చెప్పి వెళ్లాడు. అతని రాకకోసం వేయికళ్లతో ప్రతిరోజూ ఎదురుచూడసాగింది. యుద్ధం ముగిసింది.. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల అతడు అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చింది.ఆ తర్వాత అతనికి లిల్లియాన్‌ అనే యువతితో పరిచయం ఏర్పడటం, పెళ్లి జరిగిపోవటం జరిగిపోయింది. ఈక్రమంలో జెన్నీ కూడా మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పేరుకు మాత్రమే పెళ్లి చేసుకున్నారు కానీ, వారి మనసుల్లో ఒకరంటే ఒకరికి ఆరాధనాభావం పోలేదు. మనసుల్లోని ప్రేమ చావలేదు. ఆమె ఫొటో, ఆ గ్రామం పేరు ఆధారంగా జెన్నీ కోసం రాబిన్స్ అన్వేషించాడు. ఎట్టకేలకు అతడి ప్రయత్నం ఫలించి జెన్నీని కలుసుకోగలిగాడు. రాబిన్స్ మాట్లాడుతూ.. ‘నేను ప్రతిక్షణం నిన్ను ఆరాధించాను. జీవితమంతా నిన్ను ప్రేమించాను. నీస్థానం నా గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోదు. నువ్వెప్పుడూ నా గుండెల్లోనే ఉన్నావు’ అని జెన్నీతో చెప్పాడు. అతడు అపురూపంగా దాచుకున్న ఫొటోను జెన్నీకి చూపించాడు. అంతే మరింత ఆరాధనగా, ఆనందభాష్పాలు కారుస్తూ జెన్నీ అతణ్ని గుండెలకు హత్తుకుంది. వారి కలయిక అక్కడున్న చాలామందిని కంటతడి పెట్టించింది.





Untitled Document
Advertisements