టాలీవుడ్ సంచలన నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. ఈ సినిమా 2018లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మహానటి చిత్రం ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించగా, తాజాగా మరో ఘనత ఈ చిత్రం జాబితాలో వచ్చి చేరింది. చైనాలోని షాంగైలో జూన్ 15 నుండి 24 వరకు 22వ షాంగై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగనుండగా, ఇందులో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. షాంగైలో ప్రదర్శితమవుతున్న తొలి భారతీయ సినిమాగా మహానటి అరుదైన ఘనత సాధించింది. స్వప్న సినిమాస్ తమ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంది.