నాలుగు ఆండ్రాయిడ్ టీవీలను లాంచ్ చేసిన థామ్సన్ కంపెనీ

     Written by : smtv Desk | Thu, Jun 13, 2019, 05:53 PM

నాలుగు ఆండ్రాయిడ్ టీవీలను లాంచ్ చేసిన థామ్సన్ కంపెనీ

థామ్సన్ కంపెనీ కొత్తగా నాలుగు ఆండ్రాయిడ్ టీవీలను మార్కెట్‌లో లాంచ్ చేసింది. 43 అంగుళాల టీవీ ధర రూ.29,999గా ఉంది. 50 అంగుళాల టీవీ ధర రూ.34,999. 55 అంగుళాల టీవీ ధర రూ.38,999. చివరిగా 65 అంగుళాల టీవీ ధర రూ.59,999గా ఉంది. ఈ టీవీలన్నింటిలో 4కే రెజల్యూషన్, ఎల్ఈడీ ప్యానెల్స్, హెచ్‌డీఆర్ సపోర్ట్, డాల్బే ఆడియో, టీవీఎస్ ట్రూసరౌండ్, బిల్ట్ ఇన్ క్రోమ్‌క్యాస్ట్, 2.5 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీల్లో గూగుల్ ప్లే మూవీస్, గూగుల్ ప్లే మ్యూజిక్, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి యాప్స్ బిల్ట్‌ఇన్‌గా ఉంటాయి. ఇవేకాకుండా గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి ఇతర యాప్స్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీలను కొనుగోలు చేయవచ్చు.





Untitled Document
Advertisements