ఆర్‌బిఐ మిగులు నిధులను కేంద్రానికి పంపడంపై భిన్నాభిప్రాయాలు

     Written by : smtv Desk | Thu, Jun 13, 2019, 06:00 PM

ఆర్‌బిఐ మిగులు నిధులను కేంద్రానికి పంపడంపై భిన్నాభిప్రాయాలు

న్యూఢిల్లీ: మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు ఆర్‌బిఐ... నిపుణుల కమిటీని ఏర్పాటు చేసుకుంది. అయితే ఈ విషయంపై వారు భిన్నాభిప్రాయాలు తెలియజేయడంతో బుధవారం సమర్పించాల్సిన నివేదిక ఆలస్యం అయ్యింది. ఈ విషయాన్ని ప్రభుత్వాధికారులు వెల్లడించారు. ఆర్‌బిఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ నెలాఖరులో నివేదిక సమర్పించడానికి ముందు మరోసారి సమావేశమవుతుందని ఆ అధికారులు తెలిపారు. ఆర్‌బిఐ మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో కోరడంతో ఆర్‌బిఐ దీనికి సంబంధించిన నిబంధనలను సమీక్షించడం కోసం గత ఏడాది డిసెంబర్‌లో ఈ కమిటీని ఏర్పాటు చేసింది.





Untitled Document
Advertisements