భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తోను సమావేశమైనారు. పుతిన్తో భేటీ సందర్భంగా అమేథీలో రైఫిల్ తయారీ యూనిట్కు రష్యా సహకారాన్ని కొనియాడారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. జిన్పింగ్, పుతిన్, మోడీ ముగ్గురూ త్రైపాక్షిక సమావేశం జరిపారు. ఈ ముగ్గురు నేతలు భేటీ కావడం ఇది రెండో సారి. గతంలో బ్యూనస్ ఎయిర్స్లో డిసెంబర్లో జరిగిన జి20 శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో వీరు తొలిసారిగా సమావేశమయ్యారు.