రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త!

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 01:35 PM

రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త!

కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు ఓ శుభవార్త తెలియజేసింది. ప్రధాన్ మంత్రి కిసాన్ పెన్షన్ యోజన పథకంలో భాగంగా అర్హులైన రైతులకు ప్రతినెలా రూ.3,000 పెన్షన్ ఇవ్వాలని యోచిస్తోంది. పెన్షన్ పొందాలంటే రైతులు పెన్షన్ ఫండ్‌కు నెలకు నామమాత్రంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పెన్షన్ ఫండ్‌కు మీరు చెల్లించిన డబ్బుకు సమానమైన మొత్తాన్ని జమచేస్తుంది. దిగ్గజ బీమా కంపెనీ ఎల్ఐసీ ఈ పెన్షన్ ఫండ్‌ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. అంటే రైతులకు ఎల్ఐసీనే పెన్షన్ డబ్బులను అందిస్తుంది. మోదీ 2.0 గవర్నమెంట్ తొలి కేబినెట్ రైతులకు ప్రత్యేకమైన పెన్షన్ స్కీమ్‌కు ఆమోదం తెలిపింది. తొలి మూడేళ్లలో 5 కోట్ల మందికి లబ్ధి చేకూర్చాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతుల పెన్షన్ స్కీమ్‌కు సంబంధించి ఇప్పటికే అన్ని రాష్ట్రాలతో మాట్లాడారు. వీలైనంత త్వరగా పథకాన్ని ప్రారంభించాలని కోరారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసు ఉన్న రైతులను స్కీమ్ కోసం నమోదు చేసుకోవాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు. అర్హులైన సన్నకారు రైతులకు 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ ఇస్తారు. 29 ఏళ్ల వయసులో స్కీమ్‌‌లో చేరితే నెలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.





Untitled Document
Advertisements