ఇంటర్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్!

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 01:35 PM

ఇంటర్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్!

ప్రముఖ టెక్ కంపనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా ‘టెక్ బీ’అనే సరికొత్త ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా కంపెనీయే స్టూడెంట్స్‌కు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివశంకర్ మాట్లాడుతూ.. టెక్ బీ ప్రోగ్రామ్‌ను రెండేళ్ల క్రితమే తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌లో ప్రారంభించామని, మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. దీంతో కంపెనీ ఇప్పుడు మరిన్ని రాష్ట్రాలకు ఈ ప్రోగ్రామ్‌ను విస్తరింపజేసింది. దాదాపు 700 మంది విద్యార్థులు ఇప్పుడు కంపెనీ ఉద్యోగులుగా మారారు. ప్రోగ్రామ్‌లో భాగంగా కొంత మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకున్నారు’ అని ఆమె తెలిపారు. హెచ్‌సీఎల్ టెక్‌బీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అందుబాటులో ఉండనుంది. కంపెనీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో ఎంపికైన విద్యార్థులు కంపెనీ ట్రైనింగ్ ఇవ్వనుంది. ట్రైనింగ్‌లో నెలకు రూ.10,000 ఇస్తారు. ఇక ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలంటే ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. మ్యాథ్స్ సబ్జెక్ట్ తప్పనిసరి. శిక్షణ పూర్తయిన తర్వాత రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు జీతం ఇస్తారు. సంస్థలో మూడేళ్లు పనిచేయాల్సి ఉంటుంది. అలాగే ఎంపికైన విద్యార్థులు హెచ్‌సీఎల్‌లో పనిచేస్తూనే ఉన్నత చదువులు కూడా చదువుకోవచ్చు. బిట్స్‌పిలానీలో బీఎస్సీ, సస్త్రా యూనివర్సిటీలో బీసీఏ కోర్సులు చేయవచ్చు. ట్యూషన్ ఫీజు మాఫీ చేస్తారు.





Untitled Document
Advertisements