తొలి రౌండ్‌లో అగ్రగామిగా బోరిస్ జాన్సన్

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 01:54 PM

తొలి రౌండ్‌లో అగ్రగామిగా బోరిస్ జాన్సన్

లండన్: లండన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న బోరిస్ జాన్సన్ తొలి రౌండ్‌లో అగ్రగామిగా నిలిచారు. కేబినెట్ మాజీ మంత్రి బోరిస్‌కు 114 ఓట్లు రాగా, యుకె ఫారిన్ సెక్రెటరీ జెరిమీ హంట్ 43 ఓట్లతో రెండో స్థానంలో, ఎన్విరాన్‌మెంట్ సెక్రెటరీ మైఖేల్ గోవ్ 37 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ప్రధాని పదవి అభ్యర్థిగా రేసులో నిలవాలంటే కనీసం 17 ఓట్లు రావాలి. కనీస ఓట్లు కూడా సంపాదించలేని ముగ్గురు అభ్యర్థులు ఆండ్రియా లీడ్‌సోం, ఈస్తర్ మెక్‌వే, మార్క్ హార్పర్ బరి నుంచి వైదొలగవలసి వచ్చింది. దాంతో వచ్చేవారం జరిగే రెండో రౌండుకు ఏడుగురు అభ్యర్థులు మాత్రమే మిగిలారు.





Untitled Document
Advertisements