ఆగస్ట్ 8 నుంచి 17 వరకు మెల్బోర్న్లో జరగనున్న వార్షిక భారతీయ చలన చిత్ర ప్రదర్శన ఉత్సవానికి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన విక్టోరియా గవర్నమెంటు షారుఖ్కి ఆహ్వానం పంపగా, తనకి ఈ గౌరవం దక్కడంపై షారుఖ్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. చక్ దే ఇండియా సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగం మెల్బోర్న్లోనే జరిగింది.