నాగార్జున, రకుల్ ప్రీత్ జంటగా నటించిన 'మన్మధుడు 2' టీజర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. డబల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ...ఈ టీజర్ కి మంచి స్పందనే వచ్చింది. అయితే టీజర్ చూసిన రకుల్ ఫ్యాన్స్ మాత్రం ఒకింత నిరాశకు గురి అయ్యారట. దానికి కారణం టీజర్ లో ఎక్కడా రకుల్ కనపడకపోవడమే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా రకుల్ ప్రీత్ ఫ్యాన్స్ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది గమనించిన హాస్య నటుడు వెన్నెల కిషోర్ ట్రోల్ల్స్ కి చెక్ పెట్టాడు .. రకుల్ ప్రీత్ కోసం మరొక టీజర్ ని రిలీజ్ చేస్తున్నాం. ఇందుకోసం మూడు వారాలు ఆగండి అని చెప్పుకొచ్చాడు. ఇది విన్న రకుల్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారట!!