బాలీవుడ్ లో బయోపిక్ ల పర్వం నడుస్తుంది. ఇప్పటికే పలు బయోపిక్ లు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోగా..తాజాగా కపిల్ దేవ్ బయోపిక్ ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. 1983లో టీం ఇండియా ప్రపంచ కప్ ను గెలిచిన తీరును ఇందులో చూపించబోతున్నాడు డైరెక్టర్ కబీర్ ఖాన్.
ఈ బయోపిక్ లో కపిల్ దేవ్ పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన క్రికెట్ మెలుకువలు నేర్చుకునే పనిలో బిజీ గా ఉన్నారు. ఇక ఈ సినిమాలో కపిల్ దేవ్ భార్య గా ఎవరు నటిస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉండగా దీపిక పదుకునే అయితే బాగుంటుందని..సినిమాకు సైతం అంచనాలు ఏర్పడతాయనే నేపథ్యంలో ఆమెను ఎంపిక చేసినట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.
సినిమాలో ఆమె పాత్ర కేవలం పావుగంట మాత్రమే ఉంటుందట ..ఆ పావుగంట కు ఆమెకు ఏకంగా 14 కోట్ల రూపాయల పారితోషికంను అందిస్తున్నట్లు సమాచారం. దీపిక పదుకునే సినిమాలో ఉంటే సినిమాకు వచ్చే క్రేజ్ ముందు ఆమెకు ఇస్తున్న పారితోషికం పెద్ద మ్యాటర్ కాదని నిర్మాతలు అన్నారట. ప్రస్తుతం ఈమె పారితోషకం గురించి బి టౌన్ లో అంత మాట్లాడుకుంటున్నారు.