కర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో గురువారం షాంఘై సహకార సదస్సుకు హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశాధ్యక్షుడు సూరన్బే జీన్ బెకోవ్ తో సమావేశమయ్యారు. భారత్, కిర్గిజిస్థాన్ వాణిజ్య విధానంపై ప్రధానంగా చర్చ జరిగింది.కాగా ఈ సమావేశాల్లోనే ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహనీ తో భేటీ రద్దయింది. అయితే ప్రధాన నేతల షెడ్యూల్లో మార్పుల వల్ల సమయం మించిపోవడంతో ఈ భేటీ రద్దయినట్టు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. కాగా షాంఘై కో ఆపరేటివ్ ఆర్గనేజేషన్ సమ్మిట్ ముగియడంతో ప్రధాని మోదీకి ఆ దేశ ప్రధాని, అధ్యక్షులు ఘనంగా వీడ్కోలు పలికారు.