రూ.7,499 కే స్మార్ట్‌టీవీ!

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 07:21 PM

రూ.7,499 కే స్మార్ట్‌టీవీ!

జేవీసీ టీవీల తయారు కంపెనీ వియారా గ్రూప్ తాజాగా ఆరు కొత్త ఎల్ఈడీ టీవీలను మార్కెట్‌లో లాంచ్ చేసింది. వీటి ధర రూ.7,499 నుంచి ప్రారంభమౌతోంది. జేవీసీ టీవీలు 24 అంగుళాల నుంచి 39 అంగుళాల స్క్రీన్ పరిమాణంలో ఉన్నాయి. ఇవ్వన్నీ స్మార్ట్ టీవీలు కావడం గమనార్హం. ఈ టీవీలను ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. 24 అంగుళాల టీవీ ధర రూ.7,499గా ఉంది. 32 అంగుళాల్లో రెండు టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.9,999గా, రూ.11,999గా ఉంది. ఇక మిగిలిన రెండు 39 అంగుళాల టీవీలు. వీటి ధర రూ.15,999గా, రూ.16,999గా ఉంది.





Untitled Document
Advertisements