ఇంట్లో దెయ్యం ఉందని చెప్పి.....యువతిపై భూతవైద్యుడి అత్యాచారాం

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 11:09 AM

ఇంట్లో దెయ్యం ఉందని చెప్పి.....యువతిపై భూతవైద్యుడి అత్యాచారాం

ఇంట్లో తిష్ట వేసిన దెయ్యాన్ని తరిమేస్తానని నమ్మించిన ఓ భూత వైద్యుడు యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బోరబండకు చెందిన దంపతులు ఇంట్లో చికాకుల కారణంగా మూడు వారాల క్రితం మల్లేపల్లికి చెందిన ఓ భూతవైద్యుడు ఆజంను కలిశారు. వారు చెప్పింది విన్న ఆజం ఇంట్లో దెయ్యం ఉందని, దాని వల్లే చెడు జరుగుతోందని వారిని నమ్మించాడు. దానిని ఇంట్లోంచి వెళ్లగొడితే అంతా మంచే జరుగుతుందని చెప్పాడు.

ఇందులో భాగంగా వారిని రెండుసార్లు బీదర్‌లోని ఓ దర్గాకు తీసుకెళ్లి పూజలు చేశాడు. అనంతరం బాధిత దంపతుల కుమార్తె (19)ను ఓ గదిలోకి తీసుకెళ్లి రహస్యంగా మాట్లాడాడు. తనను పెళ్లి చేసుకోకుంటే తల్లిదండ్రులు చనిపోతారని యువతిని భయపెట్టాడు. ఈ నెల 11న బోరబండలోని యువతి నివాసానికి వచ్చిన ఆజం యువతిని వేరే గదిలోకి తీసుకెళ్లి బెదిరించి అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. బాధిత యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





Untitled Document
Advertisements