సాధారణంగా సూపర్స్టార్ మహేష్తో ఫోటోలు తీసుకోవాలని అభిమానులందరూ ఉత్సాహాన్నిచూపుతుంటారు. అలాంటిది మహేష్ ఓ వ్యక్తితో ఫోటో దిగడానికి ఆసక్తి చూపారంటే ఆశ్చర్యపోయే విషయమే కదా!. అసలు విషయమేమంటే.. క్రికెట్ను అమితంగా ఇష్టపడే మహేష్బాబు తన అభిమాన వెస్టిండీస్ క్రికెటర్ అండీ రాబర్ట్ను చూడగానే.. తనే అభిమానిగా మారిపోయారు. మహేష్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఇంగ్గాండ్లో జరిగే వరల్డ్కప్ పోటీలను వీక్షిస్తున్నారు. అక్కడ మ్యాచ్ చూడటానికి వచ్చి అండీ రాబర్ట్ను చూడగానే మహేష్ ఆయనతో ఫోటో దిగారు. ఆ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసుకున్నారు.
ప్రస్తుతం కుటుంబంతో కలిసి సమ్మర్ వెకేషన్లో ఉన్న మహేష్, వచ్చే నెలలో తన 26వ చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు.