ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ టోర్నీని వర్షం వెంటాడుతోంది. వర్షం కారణంగా ఈ టోర్నీలో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు రద్దయ్యాయి. రెండు మ్యాచ్ లలో కనీసం టాస్ కూడా పడలేదు. అయితే జూన్ 16న భారత్-పాక్ మధ్య జరగనున్న మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. కొంతకాలంగా ఇంగ్లండ్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే నాలుగు మ్యాచ్లు వరుణుడి ఆగ్రహానికి గురికాక తప్పలేదు. తాజాగా మరో మ్యాచ్ కూడా వర్షం బారీన పడడం ఖాయమని వాతావరణ శాఖ తెలపడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇదిలావుండగా వర్షం వల్ల మ్యాచ్లు రద్దు అవుతుండడంతో ఆయా జట్ల పరిస్థితి సంకటంగా తయారైంది. శ్రీలంక ఆడిన రెండు మ్యాచ్లు ఇప్పటికే వర్షం వల్ల రద్దయ్యాయి. దీంతో ఆ జట్టు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంది.