ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీ నెల చివరి ఆదివారం మన్ కీ బాత్(మనసులో మాట) రేడియో కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో వేర్వేరు అంశాలపై తన అభిప్రాయాలను మోదీ ప్రజలతో పంచుకుంటారు. తాజాగా ఈ నెల 30(ఆదివారం)న జరిగే 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఏం మాట్లాడాలో సూచించాలని ప్రధాని మోదీ దేశప్రజలను కోరారు.
ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1800-11-7800కు తమ సందేశాలను రికార్డు చేసి పంపించవచ్చని తెలిపారు. మైగవర్నమెంట్ ఓపెన్ ఫోరమ్ లో కూడా ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని చెప్పారు. తమ అభిప్రాయాలను ఈ నెల 29లోగా పంపాలని కోరారు. మరో ఫలవంతమైన చర్చ కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో స్పందించారు.