ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు శాంసంగ్, గూగుల్, యాపిల్ తాజా స్మార్ట్ ఫోన్స్ వివరాలను లీకెడ్ వెరిజాన్ అనే సైట్ తాజాగా వెల్లడించింది. శాంసంగ్ కంపనీ గాలక్సీ, నోట్, నోట్ ప్రో వంటి సిరీస్ లను రిలీజ్ చేస్తూ ప్రత్యెక ఇమేజ్ ను తెచ్చుకుంది. అయితే తన నెక్స్ట్ ఫోన్ శాంసంగ్ గాలక్సీ నోట్ 10 ను ఈ ఏడాది అగస్టులో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. కాని శాంసంగ్ నుండి ఇప్పటివరకు ఆ ఫోన్ గురించి ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. ఇక టెక్ దిగ్గజం గూగుల్ కూడా పిక్సెల్ సిరీస్ లో అనేక ఫోన్లు రిలీజ్ చేస్తూ వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో తమ ఉత్పత్తిని మరింత వేగవంతం చేసింది. ఈ మేరకు తన నయా ఫోన్ పిక్సెల్ 4 ను అక్టోబర్ లో లాంచ్ చేయనున్నట్లు వెరిజాన్ వెల్లడించింది. అయితే దీనిపై కూడా గూగుల్ ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. అలాగే స్మార్ట్ ఫోన్స్ దిగ్గజం యాపిల్ తన నయా ఫోన్ ఐఫోన్ 11 ను సెప్టెంబర్ లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.