చేతి వేలుకి గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పై తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. తాజాగా ఆయన ఓ మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ధావన్ గురించి మాట్లాడుతూ....''2009లో న్యూజిలాండ్ టూర్ లో భాగంగా హామిల్టన్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో నాకు గాయం అయ్యింది. నేను క్యాచ్ పట్టుకునే క్రమంలో నా వేలు ఫ్రాక్చర్ అయ్యింది. అయినా కాని నేను దానికి పెద్ద బ్యాండేజ్ వేసుకొని టూర్ మొత్తం అలాగే గడిపాను అని చెప్పుకొచ్చారు. అలాగే ఆటగాళ్ళు అతిక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆడడం నేర్చుకోవాలి'' అని సూచించారు. ''ధావన్ కూడా ఒక మంచి ఫైటర్, అతను అతి తొందరలో కోలుకొని మళ్ళీ ఫాం లోకి వస్తాడు'' అని ధీమా వ్యక్తం చేశారు.