ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. అంతేకాక ప్రపంచకప్ వంటి మెగా సిరీస్ లలో మ్యాచ్ ఉండడం ఇరు జట్ల అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టినట్టే. ఈ మెగా సిరీస్ లో భాగంగా ఆదివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సందర్భంగా ఇప్పటికే ఇరు దేశ క్రికెట్ అభిమానుల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. ఇప్పటికే భారత్-పాక్ రెండు దేశాలు ఒకరిని మించి ఒకరు టీవీలలో యాడ్స్ వంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ పరిణామాలపై తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రం స్పందించారు. ఈ మ్యాచ్ లో ఒక జట్టు ఓడిపోతుంది. ఒక జట్టు గెలుస్తుంది. అంతే తప్ప ఇంకేం చేసుకోరు. అభిమానులు దీన్ని ఓ యుద్ధం లాగా చూడకూడదని సూచించారు.