దేశీయ ఇంధన ధరలు నేడు(జూన్ 15) కూడా తగ్గుముఖం పట్టాయి. పెట్రోల్ ధరలు 19 నుంచి 21 పైసలు, డీజిల్ ధరలు 24 నుంచి 26 పైసల మేర క్షీణించాయి. హైదరాబాద్లో పెట్రోల్ ధర 19 పైసలు తగ్గి రూ.73.24 వద్ద, డీజిల్ ధర 25 పైసలు తగ్గి రూ.69.79 వద్ద కొనసాగుతున్నాయి. అమరావతిలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోల్ ధర 19 పైసలు తగ్గి రూ.74.18 వద్ద, డీజిల్ ధర 25 పైసలు తగ్గి రూ.69.13 వద్ద కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 19 పైసలు తగ్గి రూ.70 దిగువకు పడిపోయింది. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోలు ధర రూ.69.99 వద్ద కొనసాగుతోంది. ఇక డీజిల్ ధర 24 పైసలు తగ్గి రూ.63.93కి క్షీణించింది. మరోవైపు వాణిజ్య రాజధాని ముంబయిలోనూ లీటర్ పెట్రోలు ధర 19 పైసలు తగ్గి రూ.75.69 వద్ద, డీజిల్ ధర 25 పైసలు తగ్గి రూ.67.03 వద్ద కొనసాగుతున్నాయి.