పసిడి ధర ఆకాశాన్నంటుతుంది. శనివారం ఉదయానికి కల్లా ఏకంగా రూ.325 పెరిగడంతో రూ.34 వేల మార్కును దాటింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.34.195కి చేరింది. ఇక వెండి ధర ఏకంగా 40 వేల మార్కుకు చేరువైంది. శుక్రవారం ఒక్కరోజే రూ.550 పెరిగి.. రూ.38,400 ఉండగా.. శనివారం ఉదయానికల్లా రూ.వెయ్యి పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.39,450 దగ్గర నిలిచింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,358 అమెరికన్ డాలర్లు పలికింది.