నియంత్రణలు విధిస్తే పరిణామాలు ఊహకు అందవు: సుందర్ పిచాయ్‌

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 06:02 PM

నియంత్రణలు విధిస్తే పరిణామాలు ఊహకు అందవు: సుందర్ పిచాయ్‌

వాషింగ్టన్‌: టెక్ దిగ్గజం గూగుల్ లో నమ్మకాన్ని వమ్ము చేసిన కేసులో దర్యాప్తు జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే నియంత్రణలు విధిస్తే సంబంధిత పరిణామాలు ఊహకు అందవని గూగుల్‌ సిఈఓ సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. టెక్‌ దిగ్గజాలను నియంత్రించాలను కోవడంపై ఆయన హెచ్చరించారు. సిఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా తమపై ఐరోపా సంఘంలో ఇలాంటి దర్యాప్తులను ఎదుక్కొన్నామని అందుకే తాను ఇప్పుడేమీ ఆశ్చర్యపోవడంలేదని ఆయన తెలిపారు.





Untitled Document
Advertisements