యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్చరణ్తో కలిసి 'RRR' అనే మల్టీస్టారర్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. అయితే లేటెస్ట్గా కీర్తి సురేష్ తెలుగులో చేస్తోన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ఎన్.టి.ఆర్ గెస్ట్ రోల్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. కీర్తి సురేష్ సినిమా నిర్మాత మహేష్ కొనేరు ఒకప్పుడు ఎన్టీఆర్ పి.ఆర్ టీంలో వర్క్ చేశారు. ఆ కారణంగానే ఆయన గెస్ట్ రోల్ చేస్తున్నారనేది ఆ వార్తల సారాంశం. అయితే ఈ వార్తలపై ఎన్టీఆర్ పి.ఆర్ టీంను సంప్రదిస్తే.. అలాంటిదేమీ లేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలనీ క్లారిటీ ఇచ్చేశారు.