వైరల్ అవుతున్న గేల్ పిక్

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 01:39 PM

ఇండియా, పాకిస్తాన్ మధ్య నేడు జరిగే మ్యాచ్‌ కోసం యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదరుచూస్తున్నారు. ఈ ఆట అభిమానులనే కాదు క్రికెటర్లకు కూడా ఉత్కంఠగా మారిందని చెప్పాలి. వెస్టిండీస్‌ స్టార్ క్రికెటర్ క్రిస్‌ గేల్‌ ఓ విచిత్ర వేషాధరణలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేశాడు. ఔట్ అండ్ ఔట్ తెలుపు వస్త్రాల మీద అతను వేసుకున్న బ్లెజర్‌లో సగభాగం ఇండియా, సగభాగం పాకిస్థాన్ జెండాలను సూచిస్తోంది.

ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఈ బ్లెజర్‌తో గేల్ ఫోటో షేర్ చేయడంతో.. ఫోటో వైరల్ అయింది. ఓ ఆట‌గాడిగా రెండు జ‌ట్ల‌కూ స‌మంగా ప్రాధాన్య‌త ఇచ్చాడు. దీన్ని తాను ధ‌రించిన బ్లెజ‌ర్ ద్వారా వ్య‌క్తీక‌రించాడు. తన పుట్టిన రోజైన సెప్టెంబర్ 20న కూడా ఇవే దుస్తులను తాను ధరిస్తానని క్యాప్షన్ పెడుతూ, గేల్ ఈ ఫోటోను షేర్ చేశాడు.





Untitled Document
Advertisements