'మహానటి' చిత్రం ద్వారా ఒక్కసారిగా స్టార్ హోదా పొందిన కీర్తిసురేష్ కోలీవుడ్లో ఈ ఏడాది ఇంతవరకు ఒక్క సినిమాలోనూ కనిపించలేదు. అటు తెలుగులోను పెద్దగా అవకాశాలు లేవు. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో బిజీ నటిగా వున్న కీర్తి సురేష్ ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. గత ఏడాది మొత్తం 8 చిత్రాల్లో నటించింది. అందులో ‘మహానటి’, ‘సర్కార్’ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందించాయి. ప్రస్తుతం అమ్మడు ఓ బాలీవుడ్ చిత్రంలో అజయ్దేవగన్ సరసన నటిస్తోంది. ఈ చిత్రం కోసం తన బరువును కూడా తగ్గించింది. గతంలో బొద్దుగా ఉన్న కీర్తి ప్రస్తుతం స్లిమ్గా మారింది. తమిళ అభిమానులకు స్లిమ్ కంటే బొద్దుగా వున్న హీరోయిన్లనే ఇష్టపడతారు. గతంలో ఖుష్బూ, నమిత, హన్సికలు బొద్దుగా వున్నందుకే భారీ అభిమానులను సంపాదించుకున్నారు.