లండన్: వరల్డ్ కప్లో భాగంగా భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాక్ జట్టుకు సలహా ఇచ్చారు. పాక్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలని సూచించారు. పాక్ కెప్టెన్ సర్పరాజ్ ఖాన్ మాత్రం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఓడిపోతామనే భయాన్ని మెదడు నుంచి తిసిస్తే గెలుపు సాధ్యమవుతుందని ఇమ్రాన్ తన ట్వీట్లో తెలియజేశాడు. ఇక్కడ రెండు మూడు రోజుల నుంచి వర్షం పడుతుండడంతో తొలుత బౌలింగ్ చేసిన జట్టే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. చివరలో భారత జట్టు ఫెవరేట్ అని ట్వీట్ కూడా చేశాడు. 1992వ సంవత్సరంలో పాక్కు ఇమ్రాన్ ఖాన్ వరల్డ్ కప్ తెచ్చిపెట్టాడు.