అర్ద శతకాలతో దూసుకుపోతున్న రోహిత్, రాహుల్

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 04:36 PM

చిరకాల ప్రత్యర్థుల సమరంలో టీమిండియాకు శుభారంభం లభించింది. మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. అయితే, పాకిస్థాన్ పేసర్లు అమీర్, వాహబ్ రియాజ్, హసన్ అలీ కొత్తబంతితో భారత్ కు ఎలాంటి సమస్యలు సృష్టించలేకపోయారు. ఈ నేపథ్యంలో, రోహిత్ శర్మ దూకుడుగా ఆడగా, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును నడిపించారు. రోహిత్ 34 బంతుల్లోనే అర్ద సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 23 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 136 పరుగులు. రోహిత్ శర్మ 75, రాహుల్ 57 పరుగులతో ఆడుతున్నారు.





Untitled Document
Advertisements