లండన్: వరల్డ్ కప్లో భాగంగా ఇవాళ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. కానీ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎప్పటి నుంచో ఓ రికార్డు ఊరిస్తోంది. వన్డేలో 11 వేల పరుగులకు 57 పరుగుల దూరంలో కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 57 పరుగులు చేస్తే 221 ఇన్నింగ్స్లో 11 వేల పరుగులో ఖాతా రికార్డు నమోదవుతుంది. ఇంతకు ముందు సచిన్ 276 ఇన్నింగ్స్లో 11 వేల పరుగులు చేసిన రికార్డు ఉంది. ఇవాళ మ్యాచ్లో సచిన్ రికార్డులో బద్దలుకొడుతాడో వేచి చూడాలి. 11 వేల పరుగులు చేసి ఆటగాళ్లలో విరాట్ కంటే తొమ్మిది మంది ముందన్నారు. అతి తక్కువ మ్యాచ్ లో 10 వేల పరుగులు చేసిన ఘనత కోహ్లీకే దక్కింది.