పాకిస్తాన్ విజయ లక్ష్యం 337

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 07:55 PM

మాంచెస్టర్ వేదికగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ వరుణుడి దెబ్బకి కాసేపు ఆగిన సంగతి తెలిసిందే. కాసేపటికే వరుణుడు కూడా బ్రేక్ ఇవ్వడంతో మ్యాచ్ మొదలు కాగా భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు రోహిత్ శర్మ 140 పరుగులు, విరాట్ కోహ్లీ 77 పరుగులు, లోకేష్ రాహుల్ 57 పరుగులు, హార్ధిక్ పాండ్యా 26 పరుగులు చేసి భారీ స్కోర్ నెలకొల్పారు. రోహిత్ ఈ ప్రపంచకప్‌ లో రెండో సెంచరీ నమోదు చేశాడు. కానీ 140 పరుగుల వద్ద హసన్ అలీ బౌలింగ్‌లో రియాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మొత్తం రోహిత్ 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 140 పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లు మహమ్మద్ అమీర్ మూడు వికెట్లు, హసన్ అలీ ఒకటి, వహబ్ రియాజ్ ఒక వికెట్ తీశారు. పాకిస్థాన్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 337 పరుగులు చేయాల్సి ఉంది.





Untitled Document
Advertisements