'బాహుబలి' విడుదల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియా యాక్టర్ అయ్యారు. ఇప్పుడు ప్రభాస్ కమింగ్ మూవీ 'సాహో' గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్ట్ 15న సినిమా ప్యాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఎఫెక్ట్ను ఊహించని తమిళ స్టార్ హీరో అజిత్ తన కోర్ట్ డ్రామా 'నేర్కొండ పార్వై' ని (బాలీవుడ్ మూవీ `పింక్` రీమేక్) ఆగస్ట్ 10న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఐదు రోజుల వ్యవధిలోనే `సాహో` విడుదలవుతుండటంతో ఆ ఎఫెక్ట్ తమ సినిమాపై పడే అవకాశాలున్నాయని అజిత్ సినిమా దర్శక నిర్మాతలు భావించి, `నేర్కొండ పార్వై` చిత్రాన్ని జూలై నెలలోనే విడుదల చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు చేస్తున్నారని టాక్ వినపడుతుంది.