పవన్ కల్యాణ్ వల్లే టీడీపీకి ఓట్లు చీలిపోయాయి: సుమన్

     Written by : smtv Desk | Mon, Jun 17, 2019, 11:27 AM

ప్రముఖ నటుడు సుమన్ జనసేన చీఫ్, హీరో పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావడానికి పవన్ కల్యాణ్ మాత్రమే కారణమని సుమన్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో పవన్ పార్టీ పోటీ చేయడం వల్లనే ఓట్లు చీలి టీడీపీ ఓడిపోయిందని ఆయన చెప్పారు. ఓ పార్టీకి ఇన్ని ఎక్కువ సీట్లు రావడం తాను పుట్టిన తరువాత చూడడం ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు. సీఏం జగన్ ను ఆయన అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదేళ్ల పాటు జగన్ అనేక కష్టాలు పడ్డారని, ఈ క్రమంలోే ఆయన కష్టం ఫలించి ఎన్నికల్లో గెలిచారని సుమాన్ వెల్లడించారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయడం అభినందించాల్సిన విషయమని ఆయన తెలిపారు. ఎపిలోకి సినిమా పరిశ్రమను తీసుకొచ్చి, సినిమా పరిశ్రమ అభివృద్ధికి పాటుపడాలని సుమన్ జగన్ ను కోరారు.





Untitled Document
Advertisements