సోమవారం పసిడి ధర హైదరాబద్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.33,390కు చేరింది. అలాగే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.31,490కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.39,550 వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరిగింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు 0.07 శాతం పెరుగుదలతో 1,345.55 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్కు 0.36 శాతం పెరుగుదలతో 14.85 డాలర్లకు ఎగసింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.33,280కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.32,160కు ఎగసింది. కేజీ వెండి ధర స్థిరంగా రూ.39,550 వద్ద ఉంది.