ఆదివారం పాక్-ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ ఆట తీరుపై అభిమానులు ఓ రేంజ్లో సెటైర్లు వేస్తున్నారు. వరల్డ్కప్లో అత్యంత ఆసక్తిరేపిన పోరుగా ముద్రపడిన ఈ మ్యాచ్లో వికెట్ కీపింగ్ చేస్తూ పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్.. నిద్ర ముంచుకొస్తున్నట్లు తరచూ ఆవులింతలు తీయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అనంతరం బ్యాటింగ్లో విజయ్ శంకర్ విసిరిన బంతిని వికెట్లపైకి ఆడుకుని సర్ఫరాజ్ బౌల్డవగా.. షోయబ్ మాలిక్ కూడా ఇదే తరహాలో హార్దిక్ పాండ్య బౌలింగ్లో గోల్డెన్ డక్గా ఔటవడం విశేషం. ఈ మ్యాచ్ని వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 40 ఓవర్లకి కుదించగా.. పాకిస్థాన్ జట్టు 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.