టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఈ మధ్యే గాయం కారణంగా మూడు వారాలపాటు భారత ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టుకు దూరమైనా సంగతి తెలిసింది. అయితే తాజాగా ఆదివారం పాక్ తో జరిగిన మ్యాచ్ లో పేసర్ భువనేశ్వర్ బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో.. రెండు ఓవర్లు వేసిన భువీ మైదానం విడిచి వెళ్లాడు. ఎడమకాలి తొడనరాలు గట్టిగా పట్టేయడం వల్ల అతనికి కొంత రెస్ట్ అవరసం ఉంది. జూన్ 22వ తేదీన ఆఫ్ఘనిస్తాన్తో, 27న వెస్టిండీస్లతో జరిగే మ్యాచ్లకు భువీ దూరంకానున్నాడు. ఇక జూన్ 30వ తేదీన ఇంగ్లండ్తో జరగనున్న మ్యాచ్కు భువీ అందుబాటులో ఉండేది లేనిది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. త్వరలోనే భువీ కోలుకుంటాడని కోహ్లీ తెలిపాడు. అయితే ఒకవేళ స్పీడ్ బౌలర్ అవసరం అనుకుంటే.. షమీ అందుబాటులో ఉన్నాడని కెప్టెన్ చెప్పాడు.