పెళ్లికి వెళ్లివస్తు రోడ్డు ప్రమాదం.....8 మంది దుర్మరణం

     Written by : smtv Desk | Wed, Jun 19, 2019, 11:16 AM

పెళ్లికి వెళ్లివస్తు రోడ్డు ప్రమాదం.....8 మంది దుర్మరణం

ఉత్తరప్రదేశ్ లో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని సంభాల్ జిల్లాలో పెళ్లికి వెళ్లి వస్తున్న ఓ మినీ వ్యాన్ సరుకులు తరలిస్తున్న ఓ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, 12 మంది కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.

ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. వివాహానికి వెళ్లి వస్తున్న మినీ వ్యాను అలీగఢ్-అగ్రా రహదారిపై అటుగా వెళుతున్న లారీని ఢీకొట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో వ్యాను నుజ్జునుజ్జు అయిందన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.





Untitled Document
Advertisements