ఎడ్జ్బాస్టన్: ప్రపంచకప్ లో భాగంగా బర్మింగ్హామ్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా నిర్ణీత 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్టుకు 242 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ వసీమ్ ఆమ్లా(55), డుసెన్ (67 నాటౌట్)లు అర్ధ శతకాలతో రాణించారు. మారక్రమ్(38), డుప్లెసిస్(23), డేవిడ్ మిల్లర్(36)లు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది.