నా జీవితంలో ఇదో గొప్ప అనుభూతి: విజయసాయిరెడ్డి

     Written by : smtv Desk | Thu, Jun 20, 2019, 01:12 PM

నా జీవితంలో ఇదో గొప్ప అనుభూతి: విజయసాయిరెడ్డి

పార్లమెంటు లైబ్రరీ హాల్ సమీపంలో నిన్న ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ బయటకు వచ్చారు. ఈ సమావేశానికి పార్టీల అధ్యక్షులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేకపోవడంతో... వైసీపీ ఎంపీలంతా బయట ఉన్న లాంజ్ లో కూర్చున్నారు. మోదీ బయటకు వస్తుండాన్ని చూసిన వైసీపీ ఎంపీలు గౌరవ సూచకంగా లేచి నిల్చున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డిన చూసిన మోదీ... హాయ్ విజయ్ గారూ అంటూ ప్రత్యేకంగా పలకరించారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా విజయసాయిరెడ్డి పంచుకున్నారు. జగన్ కోసం నిరీక్షిస్తున్న తనను చూసి... తన వైపు అడుగులు వేసి, తనతో మోదీ కరచాలనం చేశారని తెలిపారు. తన జీవితంలో ఇదొక మధుర జ్ఞాపకమని చెప్పారు.





Untitled Document
Advertisements