మనిషి జీవితంలో యోగా చాలా ముఖ్యమైనదని బీజేపీ లోక్ సభ సభ్యురాలు, నటి హేమామాలిని తెలిపారు. అలాంటి యోగాను ఎవరు వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో హేమామాలిని పార్లమెంటు దగ్గర మీడియాతో మాట్లాడారు. యోగాను ప్రతీఒక్కరూ చేయాలని హేమామాలిని సూచించారు. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని వ్యాఖ్యానించారు. ప్రతీఒక్కరూ బాల్యం నుంచే యోగాను నేర్చుకోవాలనీ, చిన్నపిల్లలకు యోగాను నేర్పాలని సూచించారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో హేమామాలిని ఉత్తరప్రదేశ్ లోని మధుర లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు.