'నిను వీడని నీడను నేనే' ఫస్ట్ టికెట్ ఎవరికో తెలుసా ?

     Written by : smtv Desk | Thu, Jul 11, 2019, 05:13 PM

సందీప్ కిషన్ కథానాయకుడిగా 'నిను వీడని నీడను నేనే' సినిమా నిర్మితమైంది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్నరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా నిఖిల్ - సుధీర్ బాబు, అతిథులుగా కార్తికేయ - విష్వక్సేన్ హాజరయ్యారు.

ఈ సినిమా సెకండ్ టికెట్ ను వాళ్లకి సందీప్ కిషన్ అందజేశాడు. ఫస్టు టికెట్ ఏ హీరోకి ఇవ్వనున్నది 'గురువారం' చెబుతానని అన్నాడు. దాంతో అందరిలో ఆసక్తి నెలకొంది. కొంతసేపటి క్రితం సందీప్ కిషన్ తన సినిమా ఫస్టు టికెట్ ను ప్రభాస్ కి అందజేశాడు. ప్రసాద్ మల్టిప్లెక్స్ లో ప్రదర్శితం కానున్న ఈ సినిమా టికెట్ ను ప్రభాస్ కి అందజేస్తూ దిగిన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ సినిమాతోనైనా సందీప్ కిషన్ హిట్ కొడతాడేమో చూడాలి.





Untitled Document
Advertisements