హైదరాబాద్: బహుదూర్ పల్లి పరిధిలో ఆయూష్ వనం పార్కును మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి ప్రారంభించారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి ఆయూష్ పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి మట్లాడుతూ… వందకోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, అన్ని గ్రామాల్లోనూ మొక్కల్ని అందుబాటులో ఉంచామన్నారు. ఈ ఏడాది రోజ్ వుడ్, శ్రీగంధం మొక్కలు పెంచాలని నర్ణయం తీసున్నట్టు ఆయన వెల్లడించారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో నర్సరీ ఉండాలని, ఇప్పటికే 76 కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నాట్లు పికె ఝా తెలియజేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే 12 వేల నర్సరీలు అందుబాటులో ఉన్నాయని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి తెలపారు.