కన్నడ చిత్రం 'కె.జి.ఎస్' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన సంగతే. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అన్ని పరిశ్రమల నుండి ఆయనకు ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం తెలుగులోనే సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆయనతో సినిమా చేసేందుకు డీల్ కుదుర్చుకుంది. మొదట్లో వీరి చిత్రంలో మహేష్ బాబు హీరో అని వార్తలు రాగా ఇప్పుడు ఎన్టీఆర్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ అయితే మాస్ అప్పీల్ బాగా ఉంటుందని ప్రశాంత్ నీల్ ఆయన్ను ఎంపిక చేసుకున్నారట. 2020 మధ్య నుండి వీరి చిత్రం మొదలయ్యే అవకాశాలున్నాయి.