చిట్టిబాబు గా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రామ్ చరణ్.. తాజాగా కన్నడ ప్రేక్షకులను కూడా అంతే అలరించాడు. రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రలలో సుకుమార్ డైరెక్షన్లో పీరియాడికల్ చిత్రంగా తెలుగులో రిలీజ్ అయినా ఈ చిత్రం ప్రశంసలతో పాటు కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ చిత్రం ఇప్పుడు కన్నడ లో ఈరోజు విడుదలై అంతే హిట్ టాక్ సొంతం చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలో ఈ చిత్రాన్ని 85 స్క్రీన్స్లో విడుదల చేయగా, ఒక్క బెంగళూర్లోనే తొలి రోజు 26 షోస్ ప్రదర్శితమయ్యాయి. మైత్రిమూవీ మేకర్స్ మరియు జేఎమ్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రంగస్థళ పేరుతో రిలీజ్ చేశారు. ఈ చిత్రం అక్కడ కూడా పాజిటివ్ టాక్ రావడం తోచిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు.