నటి సమీరా రెడ్డి తల్లి అయింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తాను గర్భవతినని ఫోటోలను షేర్ చేస్తున్న సమీరా తనకు ఆడపిల్ల పుట్టినట్టు ఇన్స్టాగ్రామ్లో తెలిపింది. తన కూతురు చేతుల్లో తన చేతులు పెట్టుకున్న ఫోటోను షేర్ చేసింది. దీంతో ఇద్దరు బిడ్డలకు తల్లి అయిందామె. ఆమె అభిమానులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. సమీరా రెడ్డికి అంతకుముందు ఒక మగబిడ్డ ఉన్నాడు.
పదేళ్ల క్రితం ఈ భామ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్తో ‘అశోక్’ ’నరసింహుడు’ సినిమాల్లో కథానాయికగా నటించింది. మెగాస్టార్ చిరంజీవి సరసన ‘జై చిరంజీవా’ సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టిన ఈ అమ్మడు అక్కడ కొన్ని చిత్రాల్లో నటించింది. 2014లో అక్షయ్ వర్ధే అనే బిజినెస్ మ్యాన్ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ ఇస్తూ తన అభిమానులకు చేరువగా వుంది.