బిగ్ బాస్.. తొలి రెండు సీజన్లు మంచి సక్సెస్ కావడంతో ఇప్పుడు మూడో సీజన్ ప్రారంభం కానుంది. ఈ షోకి అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 14 మంది కంటెస్టెంట్స్తో ప్రారంభం కానున్న ఈ షో 100 ఎపిసోడ్లు ప్రసారం కానుంది. అయితే ఈ షో నిర్వాహకులపై ప్రముఖ యాంకర్ శ్వేతారెడ్డి నిప్పులు చెరుగుతోంది. బిగ్ బాస్-3 షోని నిషేధించాలని డిమాండ్ చేస్తోంది.
షో పేరిట అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయని శనివారం జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో శ్వేతారెడ్డి ఫిర్యాదు చేసింది. బిగ్ బాస్ పేరుతో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతోందని, బిగ్ బాస్ షోలో జరిగే విషయాలు చెప్పేందుకే తాను ధైర్యంగా ముందుకొచ్చానన్నారు. బిగ్బాస్కు ఎంపికయ్యారంటూ ఏప్రిల్లో ఒకరు ఫోన్ చేశారని, కానీ ఆ తర్వాత అగ్రిమెంట్ ఇవ్వకుండా తనను వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు బిగ్ బాస్ను ఇంప్రెస్ చేయాలంటూ తనకు ఫోన్ చేసి చెప్పినట్లు శ్వేతారెడ్డి పేర్కొంది.