దొరసాని రివ్యూస్ పై అసంతృప్తి

     Written by : smtv Desk | Sun, Jul 14, 2019, 11:00 AM

సినిమాకు హిట్ టాక్ వస్తే రివ్యూలు ఎలా రాసినా పట్టించుకోని దర్శక నిర్మాతలు తమ సినిమాకు డివైడ్ టాక్ వస్తే మాత్రం ఆ టాక్ కు కారణం రివ్యూస్ అన్నట్టుగా మాట్లాడుతారు. స్టార్ సినిమా అయితే రివ్యూలతో సంబంధం లేకుండా సినిమాలు ఆడేస్తాయి. స్టార్ హీరోల ఫ్యాన్సే తమ హీరో సినిమా బాగుంటే హిట్ చేస్తారు లేదంటే ఫ్లాప్ చేస్తారు. ప్రేక్షకుల చేతుల్లోనే సినిమా ఫలితం ఉంటుంది.

అయితే ఈ వారం రిలీజైన దొరసాని రివ్యూస్ పై అసంతృప్తి వ్యక్తపరిచారు నిర్మాత మధుర శ్రీధర్. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక కలిసి నటించిన ఈ సినిమాకు నెగటివ్ రివ్యూస్ వచ్చాయని హీరో మైనస్, కథ రొటీన్, సైరత్ కు కాపీ అని ఇలా రకరకాలుగా రివ్యూస్ రాశారు. తాము సినిమా చేసేది ప్రేక్షకుల కోసమే రివ్యూ రైటర్ల కోసం కాదని అంటున్నారు మధురా శ్రీధర్. కొత్త కథలను ప్రోత్సహించడం మంచిదని అలా చేసినా కూడా రివ్యూస్ సరిగా రావడం లేదని అన్నారు మధురా శ్రీధర్. ఈనాటి సినిమా రివ్యూయర్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు మధురా శ్రీధర్.





Untitled Document
Advertisements